CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా సంగ్రామ యాత్ర లో పాల్గొన్న చిలుకూరి..

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 28, బిజెపి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్రలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం నుంచి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లోని బెజ్జంకి గ్రామం మీదుగా పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్ర లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారి సమస్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కు తెలియజేశారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మాకు ఇంతవరకు ఎప్పుడూ కూడా పంట నష్టం ఒక రూపాయి ఇవ్వలేదుని, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బండి సంజయ్ ని రైతులు కోరినారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగుల వెంకట్ రెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భీజం శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు భుక్య వెంకటేశ్వరరావు, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ వెంకట్, మరియు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: