మర్కోడు పల్లె ప్రకృతి వనాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ అనుదీప్
గుండాల /ఆళ్లపల్లి సెప్టెంబర్ 28 (మన్యం మనుగడ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆళ్ల పల్లి మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. గులాబ్ తుఫాన్ ప్రభావం ఆళ్లపళ్లి మండలం లో తో ఎక్కువగా ఉండటంతో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. ముందుగా మర్కోడు గ్రామానికి చేరుకొని అక్కడ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం అదే గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రం చేరుకున్న కలెక్టర్ అనుదీప్ తాసిల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. బృహత్ పల్లె ప్రకృతి వనం పనులపై తాసిల్దార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో వచ్చిన తుఫాన్ ప్రభావం పై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ మండలం ఆళ్లపల్లి కలెక్టర్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కొమరం హనుమంతు. ఎంపీపీ మంజు భార్గవి, మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు, ఆళ్లపల్లి సర్పంచ్ కోటేశ్వరరావు, తాసిల్దార్ సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ , ఏ ఈ అఖిల్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: