మన్యం టీవీ, అశ్వాపురం:గులాబ్ తుఫాను ప్రభావంతో నేడు,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని..వాగులు,వంకలు,చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి కావున ఎవరు అటువైపుగా వెళ్లవద్దని,మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని,చిన్న పిల్లలను బయటకు పంపకూడదని,విద్యుత్ స్తంభాలు తాకారాదని,రైతులు పొలాలకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు వహించాలని,లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఎంతో అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసారు.విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు.మండల అధికారులందరు ప్రజలకి అందుబాటులో ఉండాలని అధికారులను అశ్వాపురం మండల తెరాస పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ కోరారు.
Post A Comment: