మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి:: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అనుబంధ మండల కమిటీల ఏర్పాటు లో భాగంగా ఎస్టీ సెల్ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షుడిగా బుచ్చన్న గూడెం గ్రామానికి చెందిన వాడే రాంబాబు నియమితులయ్యారు.ఈ సందర్భంగా వాడే రాంబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించినందుకు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ నూకల నరేష్ రెడ్డి మరియు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు.పార్టీ బలోపేతానికి తను శాయశక్తుల కృషి చేస్తూ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి అన్ని విధాలుగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్తామని తెలియజేశారు.
Post A Comment: