చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: పార్టీ కోసం పని చేసేవారికి గ్రామ కమిటీ లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్య నాయక్ అన్నారు.ఆదివారం టిఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు గారి ఆదేశాల మేరకు చండ్రుగొండ మండలం 14 గ్రామ పంచాయతీల కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 6న మద్దుకూరు, దామరచర్ల, సీతయిగూడెం 7న రవికంపాడు, పోకలగూడెం, వెంకటయ్య తండా,మంగయ్య బంజర,8న గానుగపాడు, రేపల్లె వాడ, తుంగారం, 9న తిప్పన పల్లి, బెండాలపాడు,గుర్రం గూడెం, చండ్రుగొండ పంచాయతీలలో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఉత్పల ఏడుకొండలు, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, నల్లమోతు వెంకట నారాయణ, సయ్యద్ రసూల్, గాదె లింగయ్య, జడ వెంకయ్య,భూపతి రమేష్, మేడ మోహన్ రావు, రాములు, శంకర్, బాబురావు, అప్పాజీ, భూపతి శ్రీనివాసరావు, అబ్బాస్ అలీ, బానోతు రాముడు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: