గుండాల/ ఆళ్ల పల్లి సెప్టెంబర్ 29 (మన్యం మనుగడ) దుక్కిటెద్దు మృతిచెందడంతో రైతు గుమ్మడి నగేష్ ఆవేదనకు గురవుతున్నారు. మండలం పరిధిలోని లక్షి పురం గ్రామం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైతు నగేష్ ఉదయం అన్ని పశువుల తో పాటు ఈ ఎద్దును కూడా మేత తీసుకెళ్లామని మేతమేస్తూ సుమారు నాలుగు గంటల ప్రాంతంలో కుప్ప కూలి మృతి చెందింది అన్నాడు. స్థానిక వెటర్నరీ ఎల్ ఎస్ ఏ రమేష్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి విష పురుగు కాటు వేయడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు అన్నారు. సుమారు దీని విలువ 35 వేల రూపాయలు ఉంటుందన్నారు. విషయం తెలుసుకున్న తాసిల్దార్ మహమ్మద్ సాదియా సుల్తానా, ఏ శ్రీనివాసరావు పంపించి పంచనామా నిర్వహించారు. తనను ఆదుకోవాలని రైతు నగేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు
Post A Comment: