pK ఓ సి ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ మాలోత్ రాముడు
ముళ్ళు గుచ్చుకోకుండా గులాబీలు కొయ్యడం బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగకుండా ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం వృత్తి నైపుణ్యత కు అదే కొలమానం అని సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ వెలుగులో సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మార్గదర్శకత్వంలో ప్రతి ఒక కార్మికుడు పనిచేయాలని పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ మాలోత్ రాముడు , సూపర్డెంట్ ఆఫ్ మైన్స్ శ్రీ దండమూడి రాంబాబు అన్నారు, పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం నాడు నిర్వహించిన సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రక్షణ మన బాధ్యత అనే అంశంపై పీకే ఓసి రిలే "బి " భారీ యంత్రాల ఆపరేటర్లకు, ప్రైవేటు కన్వినేన్స్ వాహన డ్రైవర్లకు, దుర్గ OB వర్కర్లకు ఎస్ ఓ పి పై అవగాహన కలిగించారు , కార్మికుల నుండి కార్మికులకు నేరుగా ఎస్ ఓ పి పై వారికున్న అవగాహనను వారి అనుభవాలను తోటివారితో పంచుకునే కార్యక్రమం ఎంతగానో విజయవంతమవుతోందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఎస్ ఓ పి పై తమకున్న అవగాహనను తోటి కార్మికులతో అనుభవ పూర్వకంగా పంచుకుని ప్రథమ బహుమతి సాధించిన ప్రైవేటు కన్విన్స్ వాహన డ్రైవర్ కె శ్రీనివాస్ (75 బొలెరో) కు అధికారులు బహుమతిని అందజేశారు ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఎస్ ఓ పి పై అవగాహన పెంచుకోవాలని తద్వారా ప్రమాదాలు నివారించాలని కోరారు, ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీ దండమూడి రాంబాబు వీసం నాగరాజు ఎం లింగబాబు, భాంగ్య, ఎండి మదార్ సాహెబ్, బి రామదాస్ ,సేతురామ్, భరత్ చంద్ర, వరుణ్, కె కామేశ్వరరావు, సూపర్వైజర్లు కార్తీక్, శివ కుమార్, రవి చంద్ర , గుర్తింపు సంఘం నాయకులు సిహెచ్ అశోక్ , ఆపరేటర్ ప్రభాకర్,ఎండి గౌసుద్దీన్..ఎస్ ఓ పి సమన్వయకర్త ఎస్ డి నా సర్ పా షా ,బిక్షపతి, యాకోబు, ఆసిఫ్ , డ్రైవర్లు GMS ఖాన్, కళ్యాణ్ , కుమార్, తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: