మన్యం టీవి, మణుగూరు:
పి.వి. కాలనీ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్,ఐ యన్ టియుసి మణుగూరు. పివికాలనీ ఆఫీసు లో విలేకర్ల సమావేశంలో వెలగపల్లి. జాన్ వైస్ ప్రసిడెంట్ మాట్లాడారు. డివిజన్ అనేక సమస్యలను పరిష్కారించకుండా నిర్లక్షంగా ఉంటం, దానివలనా జరగరానిది ఏదైన జరిగితే కార్మికులను బలిచేయటం ఇక్కడఅధికారులకు సర్వసా ధారణం అ
వుతుందన్నారు. అంబేడ్కర్ పార్కుని కార్మికులభాగస్వామ్యంతో ఎంతో ఖర్చు చేసై, దానినిర్వహణ సరిగావుండదు పార్కులో లైట్లు వెలగవు, గేట్లు తీయరు, చెత్తతోమరియు రాళ్లతో కూడిన ట్రాక్,మొత్తంగా చూస్తే పార్కునిర్వహాణ సరిగలేదనే భావన కార్మికుల వుంది.పికె ఓసికి వెళ్ళే రోడ్డు లైన్ లైట్లు 4నెలలనుండి వెలగనిపరిస్థితిని పట్టించుకొన్న పాపం పోలేదు. కొంత మంది అధికారులు కార్మికులసంక్షేమం కంటే నాయకులశ్రేయస్సు వారి మిత్ర బృందం శ్రేయస్సే ముఖ్యంగా భావిస్తున్నారు.కష్టపడి పనిచేసే కార్మికులను ఇంక బయపెట్టిఉత్పత్తి తీస్తు, వాళ్లకు అనుకూలంగా వున్న, పైరవీలతో వచ్చినవారిని కోరుకున్న చోట కోరుకున్న పనిని ఇవ్వటం ఇక్కడ అధికారులకు చెల్లుతుందని కష్టపడి పనిచేసి సంస్థకు చేవచేసి ఆనారోగ్యంతో భాధపడుచున్నపట్టించుకోరు. పైఅధికారులుడివిజన్ లో కార్మికులకు జరుగుచున్న అన్యాయాన్ని ఏప్పటికప్పుడు విచారణ జరపాలని ఐయన్ టియుసి కోరుచున్నది.పి.నారాయణ, చందనరాజు, టి. శ్రీను, యస్. రాంబాబు, ముత్తేస్వరరావు, పి. శ్రీను, బాలకృష్ణ, యం.శ్రీను పాల్గొన్నారు.
Post A Comment: