మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో కొన్ని రోజుల నుంచి వర్షాలు పడక రైతులు ఆందోళన చెందుతుండగా గత రెండు రోజుల నుంచి వర్సాలు కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాగులు వంకలు, పొంగి పొర్లుతున్నాయి, పలు చోట్ల పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. కురిసిన భారీ వర్షానికి తిరుమలకుంట బోగందాని గండి చెరువు జలకళ సంతరించుకుంది. చెరువుపై నిర్మించిన చెక్ డ్యాంలపై నీరు భారీగా నిండి అలుగు పారుతుంది. అలుగు వద్ద గిరిజనులు, చేపలు పడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం భారీ వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగి పంటలు బాగా పండుతాయని రైతులు సంతోషంగా ఉన్నామని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
Post A Comment: