CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అధైర్య పడొద్ధు. అండగా ఉంటా:ఎంపీటీసీ వేముల భారతి

Share it:

 


వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన...ఎంపీటీసీ వేములభారతి


 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్సానికి అశ్వారావుపేటలోని వీధులు జలమయమైనవి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో అశ్వారావుపేట ఎంపీటీసీ వేములభారతి నేడు అశ్వారావుపేట మండలంలో మొదటి సెగ్మెంట్ లో దొంతికుంట, వడ్డెర బజారు, చిన్నం శెట్టి బజారు, మద్దిరావమ్మ గుడిసెంటెర్ ప్రాంతాలను ఎంపీటీసీ వేములభారతి పర్యటించారు. వర్షం వస్తున్నా చూడకుండా ఒక్కో ఒక్కో కుటుంబాన్ని పరామర్శించి, మూడు రోజులపాటు వర్షాలు కారణంగా మీ బాగోగులు ఎప్పటికి అప్పుడు తెలియచేస్తు వుండాలని, ప్రజలను అక్కడి సమస్యలను ఎంపీటీసీ వేముల భారతి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వేముల భారతి మాట్లాడుతూ భారీ వర్షాలు మరియు వరదల కారణంగా అశ్వారావుపేట ‌లో ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం సహాయం చేయాలని, ఉప్పొంగే నీరు తమ ఇళ్లను ముంచెత్తడంతో, ప్రజలు బియ్యం, పప్పులు మొదలైన వారి నిత్యావసర వస్తువులను కోల్పోవడం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణ సహాయంగా ప్రభుత్వం ఆదుకోవాలని, వర్షాలు మరియు వరదల్లో పూర్తిగా దెబ్బతిన్న అన్ని ఇళ్లకు ఒక్కొక్కరికి పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లన్నింటికీ ప్రభుత్వం సహాయం చేయాలనీ రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల సౌకర్యాలను మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని మరియు జీవితం త్వరగా సాధారణ స్థితికి వచ్చేలా చూడాలని అధికారులను పేదలకు సహాయం చేయడానికి, నిర్మాణపు పనులు చేపట్టాలని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎంపీటీసీ1 వేముల భారతి ఆవేదన వ్వక్తం చేశారు.

Share it:

Post A Comment: