కోవిడ్ నిబంధనలు పాటించాలి అని ఎస్ఐ జితేందర్ ఆదేశాలు
అవగాహన కల్పిస్తున్న ట్రైని ఎస్సై విజయలక్ష్మి
మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఎస్ఐ జితేందర్ ఆదేశానుసారం ట్రైని ఎస్సై విజయలక్ష్మీ మండలం లో ఏర్పాటు చేస్తున్న వివిధ గ్రామాల్లో గల ఉత్సవ కమిటీలకు ఆమె అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.కోవిడ్ నిబంధనలు తప్పని సరి పాటించాలి అని ఎస్సై జితేందర్ ఆదేశానుసారం వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవకమిటీలు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై విజయలక్ష్మి అన్నారు. రాత్రి 9 గంటల సమయం తర్వాత మైక్ సెట్,సౌండ్ బాక్సులు నిలిపేయాలి అని ఆమె అన్నారు.ఊరేగింపు కి పెద్ద మొత్తంలో జనం పోగు కావద్దని డీజేలు ఏర్పాటు చేయరాదని ఆమె చూచించారు. పూజా కార్యక్రమాలకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పాల్గొనాలని పూజలో పాల్గొనే వారు శానిటేజర్ తో పాటు మాస్క్ లు ధరించాలి అని ఆమె అన్నారు.
Post A Comment: