శిక్షణ నిమిత్తం ఐదుగురు విద్యార్థులకు ఆర్థిక సాయం
మన్యం మనుగడ, డెస్క్:
ఉన్నత స్థానాలను చేరాలని కలలు కని, శిక్షణ నిమిత్తం ఆర్థిక స్తోమత లేని పినపాక నియోజకవర్గానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ కొలువు పొందేందుకు శిక్షణ తీసుకోవడానికి ఆర్థికంగా లేకపోవడం వలన, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు విషయాన్ని తెలియజేయగా, వెంటనే స్పందించిన ఆయన హైదరాబాదులోని రామయ్య సబ్ ఇన్స్పెక్టర్ శిక్షణా సంస్థ కు విద్యార్థులకు అయ్యే ఖర్చు 1,60,000 ను రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. మరచిపోలేని ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వ విప్ కు విద్యార్థులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వ్యక్తిగత సహాయకులు చందా హరికృష్ణ, మహేశ్వరం సాయినాథ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: