మాన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో ములకపాడు గ్రామంలో ఈరోజు మహిళా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో గిరిజన కుటుంబానికి చెందిన త్ర అత్యాచారం చేసి చంపిన రాక్షసుణ్ణి వెంటనే కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళా సంఘం మండల కార్యదర్శి రాజమ్మ డిమాండ్ చేశారు కుటుంబానికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అలానే 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అలానే భద్రాచలం పట్టణంలో సుందర్ నగర్ కాలనీలో బతుకుదెరువు కోసం వచ్చిన వలస ఆదివాసులు మైనర్ బాలికలను తాపీ మేస్త్రి అత్యాచారం చేశాడని అతడిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీత ,ఇందుమతి, భవాని, సరోజిని, దుర్గ ,నరసమ్మ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: