మన్యం టీవి, బూర్గంపాడ్:
బూర్గంపహాడ్ మండల పరిధిలోని వేపలగడ్డ గ్రామ పంచాయతీ మీదగా వెళ్లే సీతారామ ప్రాజెక్టు కాలవకి నిన్న కురిసిన భారీ వర్షానికి గండి పడడంతో స్థానిక సర్పంచ్,స్థానిక రైతులు కలిసి జడ్పీటీసీ దృష్టికి తీసుకెళ్లాగా వెంటనే స్పందించి ఈరోజు ఆ గండి పడిన ప్రాంతాన్ని సందర్శించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ,తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి.
అనంతరం జడ్పీటీసీ ,తహశీల్దార్ స్థానిక రైతులతో మాట్లాడుతూ ఈ సమస్యని జిల్లా కలెక్టర్ దృష్టికి మరియు ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంజా చిన్నభాయ్ ,స్థానిక పంచాయతీ సెక్రటరీ బిందుషా ,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు వర్సా రాంబాబు ,RI శంకర్ ,స్థానిక రైతులు పాల్గొన్నారు.
Post A Comment: