గుండాల సెప్టెంబర్ 28 (మన్యం మనుగడ) మండలంలో గులాబ్ తుఫాన్ విధ్వంసం సృష్టించి పెను నష్టాన్ని కలిగించింది. సోమవారం రోజు వచ్చిన తుఫాన్ దాటికి ముత్త పురం, మోదుగుల గూడెం, గ్రామాల సమీపంలోని అల్లిచెరువు, ఎర్ర చెరువులు వరద ఎక్కువ కావడంతో గండ్లు పడి నీరు వృధాగా పోయింది. ఈ రెండు చెరువుల ను నమ్ముకొని రైతులు వాటి క్రింద వరి సాగు చేశారు. అర్ధాంతరంగా వచ్చిన వర్షానికి చెరువులు గండ్లు పడడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి చెరువులకు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు
Post A Comment: