తుడుం దెబ్బ
మన్యం టీవీ మంగపేట.
సైదాబాద్ లో గిరిజన చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి హత్యచేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి,ఉరి శిక్ష విధించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్ డిమాండ్ చేసారు.తెలంగాణ ప్రభుత్వ అలసత్వం ప్రదర్శించడం వలన ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, సంఘటన జరిగినంక స్పందిస్తున్నారని ,సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని హితవు పలికారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని, ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింత కృష్ణ, జిల్లా ఉఫాధ్యక్షులు పాయం జానకిరామన,మడకం చిట్టిబాబు, చింత సోమరాజు, ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: