మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం:: తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ను అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు, హైదరాబాద్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో అద్వానంగా ఉన్న రోడ్లు తో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన మెచ్చా, బిటి రోడ్డు మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలను మంత్రి కి అందించడం జరిగింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఇచ్చిన ప్రతిపాదనలను త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
Post A Comment: