CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూమిలో పంట ధ్వంసం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

Share it:

 


మన్యం టివి:ములకలపల్లి మండలం: కొత్తూరు గ్రామంలో రాత్రి సమయంలో పత్తి పంటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు,ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్న కొత్తూరు గిరిజనులు పోడు భూమిని నమ్ముకొని వ్యవసాయం,జీవనం చేస్తున్నారు,వారికి పోడు జీవనాధారంగా ఉంది.ఫారెస్ట్ అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి సమయంలో లో పంట రైతు చేతికి వచ్చిన పత్తిని నరికి వేశారు ఆరుగాలం కష్టించి పంట వచ్చే సమయంలో పంటనునరికివెయటం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు,అనంతరం స్థానిక తాసిల్దార్ ఆఫీస్ లో తాసిల్దార్ ఎల్ వీరబద్రం ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.పోడు నరికిన వారిపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది .కార్యక్రమంలో వూకంటి రవి,నిమ్మల మధు,పొడియం వెంకటేశ్వర్లు,స్వయం కృష్ణ,దుబ్బ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: