మన్యం టీవీ చర్ల: చర్ల మండలం లోని ఉన్న తాలిపేరు ప్రాజెక్ట్ కు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి మరియు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు అధికంగా వరద నీరు పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన అధికారులు తాలిపేరు ప్రాజెక్టు యొక్క 19 గేట్లు ఎత్తి 36,700 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం 74 మీటర్లు ఉందని, కావున 73.10 మీటర్ల నీటి నిల్వ ఉంచి అదనపు నీటిని గేట్లు ఎత్తి గోదావరి లోకి విడుదల చేయడం జరుగుతుంది అని డిఈఈ తిరుపతి తెలిపారు.
Navigation
Post A Comment: