మన్యం టీవి వెబ్ డెస్క్:
నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా 1300 ర్యాంకు సాధించిన పూల వ్యాపారి కొడుకు డాక్టర్ ఫహీం .కొత్తగూడెం ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి పూల వ్యాపారం కొనసాగిస్తున్న సత్తార్ తన కుమారుని ఉన్నత చదువులు చదివించాలనే సంకల్పంతో ఎంతో కష్ట పడుతూ తన కుమారుని డాక్టర్ని చేయాలని పట్టుదలతో ఎంత కష్టమైనా ఇష్టంగా భావించి చదువులో రాణించిన కుమారుడు చిన్నతనం నుండే చదువుపై ఆసక్తి తో పదో తరగతి లోను 9.5 మార్కులు సాధించి ,ఇంటర్ Bipc లో రాష్ట్ర అయిదవ ర్యాంకు సాధించారు. అదే పట్టుదలతో ఉత్సాహంతో ఎంబిబిఎస్ లో చేరి 80 శాతం మార్కులతో ఎంబీబీఎస్ పూర్తి చేశారు .ఇటీవల జరిగిన నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో 800 మార్కులకు గానూ 621 మార్కులు సాధించి ఆల్ ఇండియన్ 1300 ర్యాంక్ సాధించి కొత్తగూడెం ప్రతిష్టను చాటిచెప్పారు .పూల వ్యాపారం చేస్తున్న సత్తార్ కొడుకు డాక్టర్ ఫహిం తన తండ్రికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి కొత్తగూడెం కూడా పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చారు ఆల్ ఇండియ 1300 ర్యాంక్ సాధించిన సత్తార్ కొడుకు డాక్టర్ ఫాహింను స్థానికులుఅభినందనలు తెలియజేశారు.
Post A Comment: