మన్యం మనుగడ,ఇల్లందు: ఇల్లందు ఏరియా కోయగూడెం ఓపెన్ కాస్ట్-2 నుండి కారుణ్య నియామకాల కొరకు మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఏరియా జిఎం మల్లెల సుబ్బారావు ఆదేశాల మేరకు ఈ రోజు జియం కార్యాలయం పర్సనల్ విభాగంలో ముఖాముఖీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డిజిఎం పర్సనల్ జివి.మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ ఇల్లందు ఏరియా నుండి కారుణ్య నియామకాల కొరకు కోయగూడెం ఓపెన్ కాస్ట్ -2 నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు వారి వారి కుటుంబ సభ్యుల మరియు సాక్షుల సమక్షంలో ఈ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించి అన్ని వివరాలు నమోదు చేయడమైనది, ఇంటర్వ్యులు పూర్తి అయిన వారికి వైద్య పరీక్షల కొరకు పంపించిన తర్వాత నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె ఒసి ప్రాజెక్ట్ అధికారి మల్లారపు మల్లయ్య, మేనేజర్ జీవన్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు నూతల సుజ్ఞాన్, పసునూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: