*✍️విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు అవ్వండి-- ఉప్పుశెట్టి రాహుల్.
*✍️ఘనంగా ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
గుండాల: విద్యార్థి ఉద్యమాల దిక్సూచి ఏఐఎస్ఎఫ్ అని *జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్* అన్నారు. గురువారం స్థానిక వివేకవర్ధిని కళాశాలలో ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని రాహుల్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభల్లో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పరాయి పాలకుల చెర నుండి భరతమాత విముక్తి కోసం విద్యార్థులను అందరిని ఒక్క తాటిపైకి తీసుకురావటానికి లక్నో నగరాన బెనారస్ విశ్వవిద్యాలయంలో 1936 ఆగస్టు 12న అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆవిర్భవించిందని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం అనంతరం విద్యారంగ సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా ఆనాటి నుండి నేటి వరకు సమరశీల ఉద్యమాలు కొనసాగిస్తున్న ఈ దేశ ప్రథమ విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్య ఉపాధి హక్కుల సాధనకై సమరశీల పోరాటాల కు సిద్ధం కావాలని విద్యార్థి
Post A Comment: