CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు

Share it:

 


- ల్యాబ్ టెక్నీషియన్లు అనవసర పరీక్షలు చేయొద్దు, ధరల పట్టిక పాటించాలి

- ఆర్ఎంపీలు యాంటీబయోటిక్స్ అధిక స్థాయిలో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

- సీజనల్ వ్యాధులైన మలేరియా డెంగ్యూ టైఫాయిడ్  పేషెంట్లను ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలి

- పినపాక పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శివ కుమార్

--------------------

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఈరోజు పినపాక మండల ఆరోగ్య కేంద్రంలో , పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆర్ ఎం పి లు,పి ఎం పి లు మరియు ల్యాబ్ టెక్నీషియన్ లకు సమావేశం నిర్వహించడం జరిగిందని వైద్యులు డాక్టర్ శివ కుమార్ తెలిపారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభావంతో మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి వ్యాధులు విజృంభించే అవకాశం ఉందన్నారు. ఎవరైనా మలేరియా టైఫాయిడ్ రోగ లక్షణాలతో పాజిటివ్ గా ఉన్నట్లయితే వారిని తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి సిఫార్సు చేయాలని, ఆర్ఎంపీలు తమ స్థాయిని మించి వైద్యం చేయరాదని డాక్టర్ శివ కుమార్ సూచించారు. కొందరు ఆర్ఎంపీలు అధిక స్థాయిలో వైద్యం చేస్తూ, యాంటీబయోటిక్స్  పరిమితికి మించి వాడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారిని గుర్తించి వారి లైసెన్స్ రద్దు చేస్తామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. అంతేకాకుండా కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు  అనవసరమైన పరీక్షలు చేస్తూ ప్రజల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఏ క్షణంలోనైనా వైద్యాధికారులు తనికీ నిర్వహిస్తారని, ల్యాబ్లు సీజ్ చేస్తామని తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లు ప్రతి ఒక్కరు విధిగా ధరల పట్టిక ఏర్పాటు చేయరాదని ని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎవరిని ఉపేక్షించేది లేదని, ప్రతి ఒక్కరు పరిమితికి మించి వైద్యం చేయరాదని ని కోరారు. ఈ కార్యక్రమంలో HEO వీరస్వామి, అరుణ్ బాబు, పినపాక ఎంపీటీసీ చింతపంటి సత్యం, ఆర్ఎంపీలు లాజరస్, నరసింహారావు, చారి, ఇతరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: