మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి(ఆగస్టు 09):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలంలో జారే ఆదినారాయణ స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసి గిరిజన దినోత్సవం సందర్భంగా ఆదివాసీల ఉద్యమ నాయకుడు సోయం గంగులు కి అనుచరుడిగా పనిచేసిన బండారు బొజ్జి వారి సతీమణి బండారు రాములమ్మ చేతుల మీదుగా ఆదివాసి జెండా ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుశీల, దమ్మపేట మండల ఎంపీపీ సోయం ప్రసాద్ , ఉపాధ్యాయులు మెచ్చు వెంకటేశ్వరరావు, ఆదివాసీ నాయకులు మడకం ప్రసాద్, గండుగులపల్లీ గ్రామ అధ్యక్షులు ఎర్ర వసంతరావు , టిఆర్ఎస్ పార్టీ దమ్మపేట మండల యువజన అధ్యక్షులు కాసాని ప్రసాద్ ,సున్నం రాంబాబు,గంటా వెంకటేశ్వరరావు, మరియు గ్రామపెద్దలు కురసం సీతారాములు,కూరం సింగరాజు,కుంజా రాజారావు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: