మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలంలోని అశ్వరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో లక్ష్మీ శ్రీనివాస థియేటర్ కాంప్లెక్స్ లో ఈరోజు జ్ఞానేశ్వరి న్యూట్రిషన్ సెంటర్ ను అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక శరీరం మరియు అనారోగ్య సమస్యలతో బాధడుతున్నవారు ఈ న్యూట్రిషన్ సెంటర్ కు వెళ్లి ప్రతి రోజు శరీరానికి కావలసిన న్యూట్రిషన్ బరువు తగ్గించుకోవడం, రోజు మొత్తం ఉత్సాహంగా ఉండడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, క్యాలరీల మేనేజ్మెంట్
మరియు పౌష్ఠిక ఆహారం సంబంధించిన విలువైన సమాచారాన్ని, మన ఆరోగ్యాన్ని మనం ఎలా పెంచుకోవాలి, మన శరీరాకృతికి సంబంధించిన వ్యాయామాలు, ఇక్కడకి వచ్చి నిపుణుల సలహాలు, సూచనలూ తీసుకొని మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో అయనతో పాటు అశ్వారావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఆట్టం రమ్య, న్యూట్రిషన్ షాప్ యాజమాన్యం, తదితరుల పాల్గొన్నారు.
Post A Comment: