మన్యం టీవీ : ఇల్లందు
ఆదివాసీ హక్కులు,చట్టాలు రక్షణకు సంస్కృతి,సంప్రదాయల పరిరక్షణకు ఆదివాసీలు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం( టీఏజీఎస్) రాష్ర్ట కమిటీ సభ్యులు వజ్జా సురేష్ పిలుపునిచ్చారు.
ఇల్లందులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం జరిగిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ పాలకులు ఆదివాసీలను అణచి వేస్తూ జీవించే హక్కును హరిస్తున్నారని అన్నారు.తెగలు,బాషా అంతరించి పోతున్న గాని పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.ఆదివాసీల ను అడవికి దూరం చేస్తూ బలవంతంగా పోడు సాగుదారులను నిర్బంధిస్తూన్నారని ఆదివాసీ హక్కులను హరిస్తున్నారని అన్నారు.మూల వాసులుగా ఉన్న ఆదివాసీలు అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు.దళిత బంధు లాగానే ఆదివాసీలకు ఆదివాసీ బంధు ను ఏర్పాటు చేసి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఈసం వెంకటమ్మ,చీమల రమణ,కుంజ రమేష్,వాసం పవన్, చింత రాంబాయి,యప వెంకటమ్మ,ఈసం రాధ, వాసం శ్రీలత తదితరులు పాల్గొన్నారు
Post A Comment: