మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలంలోని కట్టుగూడెం గ్రామ నివాసి భాగం వెంకటేశ్వరరావు. కొద్ది రోజుల క్రితం అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా మరణించిన విషయం అందరికీ విధితమే. వారి మరణ వార్తను తెలుసుకున్న తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆదివారం నాడు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భాగం వెంకటేశ్వరరావు మరణానికి కారకులైన ఫారెస్ట్ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబానికి 30 లక్షల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇప్పటివరకు వారి కుటుంబాన్ని పరామర్శించికపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీలం చెన్నారెడ్డి, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో కన్వీనర్ సోయం వీరభద్రం, తదితర నాయకులు ఉన్నారు.
Post A Comment: