👉 ఆదివాసి నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంఘం నాగరాజు
మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 29, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించి ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి ఆదివాసి ఎమ్మెల్యేను అవమానించడంన్ని ఆదివాసి నాయకపోడు సేవా సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంఘం నాగరాజు మాట్లాడుతూ.. ఒక ఆదివాసీ ఎమ్మెల్యేను అధికారిక కార్యక్రమానికి ఆహ్వానించి ప్రోటోకాల్ ను ఉల్లంఘించి స్టేజిపైకి ఆహ్వానించకపోవడం, స్టేజీ ఫ్లెక్సీ బ్యానర్ లో ఫోటోను ముద్రించక పోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ తతంగం జరిగినా పెదవి విప్పకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నప్పటికీ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారని మండిపడ్డారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ గిరిజన ప్రజా ప్రతినిధులను నిబంధనలను ఉల్లంఘించి అవమానపరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Post A Comment: