CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిగ్నల్ లేక తరగతులు జరగక చదువులు ఆగమాగం

Share it:

 


 చెట్ల కింద నీళ్ల ట్యాంకులపై    సిగ్నల్ కోసం విద్యార్థుల పోరాటం

 గుండాల / అల్లపల్లి  ఆగస్టు 13 (మన్యం మనుగడ)  సిగ్నల్ లేక తరగతులు  జరగక   విద్యార్థుల చదువులు   అయోమయంలో ఉన్నాయి.   సెల్ సిగ్నల్ కోసం చెట్ల కింద మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైకెక్కి సిగ్నల్ కోసం పోరాడాల్సిన   పరిస్థితి నెలకొంది.  ఆళ్ల పల్లి మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో నిత్యం  విద్యార్థులు చదువుకోవడం కోసం సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. మర్కోడు గ్రామంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఒక్కటే ఉండడంతో రోజుల తరబడి సిగ్నల్ పోవడం వలన వేరే  గత్యంతరం లేక విద్యార్థులు ఇతర   సిగ్నల్స్ కోసం ఇలాంటి సాహసాలు చేసి ఆన్లైన్ చదువులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా  బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు స్పందించి నిత్యం సెల్ సిగ్నల్  ఉండేలా చూడాలని తల్లిదండ్రులు మరియు విద్యార్థులు  కోరుకుంటున్నారు

Share it:

Post A Comment: