జగ్గారం అటవీ సరిహద్దు ప్రాంతం ( ట్రెంచ్) లో నీటి నిల్వలలో ఆయిల్ బాల్స్ వేసిన పంచాయతీ సిబ్బంది
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జగ్గారం పంచాయతీలో డెంగ్యూ వ్యాధి కారణంగా ఐదుగురు మృత్యువాత పడిన విషయం విధితమే. మన్యం మనుగడ వరుస కథనాలకు స్పందించిన జగ్గారం పంచాయితీ సర్పంచ్ పంచాయతీని ఆనుకొని ఉన్న అటవీశాఖ గతంలో వేసిన సరిహద్దు ప్రాంతం( ట్రెంచ్) లో భారీ మొత్తంలో నీటి నిల్వలు కారణంగా, జగ్గారం గ్రామ పశు వ్యర్ధాలు ఆ నీటిలో కలిసిన కారణంగా కొంతవరకు డెంగ్యూ వ్యాధి కి కారణం అయి ఉంటుందని తెలుసుకుని, పంచాయతీ సిబ్బంది నీటి కుంటలలో ఆయిల్ సీడ్ బాల్స్ ను వేసి దోమల లార్వా అభివృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం నాడు పంచాయతీ సిబ్బంది ఆయిల్ బాల్స్ ను నీటి గుంటలలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగారం సర్పంచ్ గుమ్మడి అనంత, జగ్గారం పంచాయతీ సెక్రెటరీ అరుణ్ కుమార్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: