మన్యం మనుగడ,బూర్గంపాడు:
బూర్గంపాడు ఎస్సై జితేందర్ ఆదేశాల మేరకు ట్రైనీ ఎస్ఐ విజయలక్ష్మి పర్యవేక్షణలో ప్రసాద్ కానిస్టేబుల్ తన విధి లో భాగంగా చాకచక్యంగా పిడిఎస్ రైస్ అక్రమ రవాణాను అడ్డుకుని రెండు ఆటోలను స్టేషన్ కు తరలించారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం నుంచి మరియు కృష్ణ సాగర్ నుంచి అశ్వాపురం పరిసర ప్రాంతాలకు పేదలకు దక్కాల్సిన పీడీఎస్ బియ్యాన్ని TS04 UB 2381, TS28 TA 2505 నంబర్లు గల రెండు ఆటోలలో అక్రమ రవాణా చేస్తూ స్థానిక పోలీసులకు పట్టుబడ్డారు. మండల అధికారులు స్పందించి పెద్దమనుషుల ముసుగులో ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Post A Comment: