CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ సెంటర్లో పని చేసిన వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలి

Share it:



మన్యం మనుగడ, మణుగూరు:

 ఐ.ఎఫ్.టి.యు  మణుగూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్ష ప్రారంభం.ఈ రిలే నిరాహార దీక్షను ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.

          ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సెంటర్లో పని చేసిన వర్కర్లకు మూడు నెలల వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. వేతనాలు చెల్లించాలని  డి ఎం హెచ్ ఓ, మరియు స్థానిక తహసిల్దార్ మరియు హాస్పిటల్ ఇన్ చార్జి గారి దృష్టికి తీసుకెళ్లిన అప్పటికీ ఫలితం లేదన్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో వర్కర్లు రిలే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని వర్కర్ల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

          ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా నాయకులు ఎండీ. గౌస్, మహాలక్ష్మి, రాణి, భారతమ్మ, మంగమ్మ, జయమ్మ, శైలజ, జానకి, రాంబాయమ్మ, రాములు, పి.రాములు, తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: