గుండాల ఆళ్ల పల్లి ఆగస్టు 5 (మన్యం మనుగడ) :
అభివృద్ధి పనుల కోసం పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను ఆళ్లపల్లి మండలం ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు సమావేశమయ్యారు. మండలంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని వారు కోరారు. పెండింగ్లో ఉన్న రహదారులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని వారు కోరడంతో సానుకూలంగా స్పందించిన రేగా త్వరలోనే మండలంలో అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, ఎంపీపీ మంజు భార్గవి, సర్పంచులు నరసింహారావు, ప్రేమ కళ, నిర్మల, వెంకట్ నారాయణ, టి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు భద్రం, నాయకులు ఖయ్యుం, కిషోర్, కృష్ణ , సతీష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: