మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం మండలం అమెర్థ కాలనీలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇటివలే మరణించిన ఎడెల్లి సంజీవరావుకి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు నజీర్ షోను సహాయసహకారాలతో నెల రోజులకు సరిపడ 25కేజిల బియ్యం, నిత్యావసర సరుకులు కురగాయలు అందించడం జరిగింది. వారు మాట్లాడుతూ చిన్నతనం నుండి పోలియా వచ్చి వికాలంగుడు అయినా ఎడెల్లి సంజీవరావు అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇటివలే మరణించడం జరిగింది. ఇంటి పెద్దదిక్కుని కొల్పోయిన సంజీవరావు కుంటుంబ సభ్యులను ఓదార్చి, మానవతా దృక్పథంతో ఆలోచించి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మా వంతుగా 25కేజిల బియ్యం నిత్యావసర సరుకులు కురగాయలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు నజీర్ షోను, అమెర్థ గ్రామ పంచాయతీ ప్రధాన కార్యదర్శి మోదుగు వంశీ, నాయకులు మేకల సామెలు, జెట్టి ప్రభాకర్, దోడ్డ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: