CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చదువుల తల్లికి తప్పని నిరీక్షణ.

Share it:



 మన్యంటీవీ, అశ్వారావుపేట:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఆసుపాక గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు, 7 గురు ఉపాధ్యాయులు ఉన్నారు. దాతల సహాయం తో 2012 సంవత్సరంలో సరస్వతి దేవి మరియు మహాత్మా గాంధీజీ విగ్రహాలు ఏర్పాటు చేసారు. కొంత కాలం తరువాత సరస్వతిదేవి యొక్క చేతులు తల, వీణ విరిగిపోయాయి. వీణ తో ఎంతో ఆకర్షనీయంగా ఉండే ఈ విగ్రహం ఇప్పుడు ఇలా దర్శనం ఇస్తుండటంతో విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్ళు గడుస్తున్న కనీసం మరమ్మతులు చేయించాలి అనే ఆలోచన కూడా లేకుండా ఉపాధ్యాయులు గాని అధికారులు గాని తమకి పట్టనట్లు ఉండటం గమనర్హం, విగ్రహాలతో పాటు ఈ పాఠశాలకు ఉన్నటువంటి గేట్ కూడ విరిగిపోయి ఏళ్ళు గడుస్తున్న కానీ చిన్న చిన్న మరమ్మతులకు కూడ నోచుకోవడం లేదు ఎంతమంది ఉపాధ్యాయులు వచ్చి వెళ్తున్న ఈ పాఠశాలలో మాత్రం ఇదేవిధంగా ఉంటుంది. తమ కెందుకులే అనే విధంగా వ్యవహారిస్తున్న తీరు ఇప్పటికైనా మారి విగ్రహాలకు మరియు పాఠశాలకు కనిస మరమ్మతులు చేయించి విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని విద్యార్థులు తల్లితండ్రులు పాఠశాల యాజమాన్యాని కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: