గుండాల ఆగస్టు 7 (మన్యం మనుగడ) అత్తింటివారు అవమానించారని అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. రోళ్ల గడ్డ తండాకు చెందిన జాటోత్ గణేష్ కు సౌందర్య తో 2 సంవత్సరాల క్రితం వివాహమైంది. నెల రోజుల క్రితం సౌందర్య పురుగుల మందు తాగడం తో తల్లిదండ్రులు వరంగల్ తీసుకెళ్లారు అక్కడే ఉంటున్న సౌందర్యను ఇంటికి తీసుకొచ్చేందుకు గణేష్ తన తమ్ముడితో కలిసి వరంగల్ వెళ్లగా అత్తింటివారు గణేష్ అతని సోదరుని కొట్టడంతో మనస్తాపం చెందిన గణేష్ తన ఇంటి వద్దకు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన గుండాల సి ఐ శ్రీనివాస్ ఎస్ ఐ జీవన్ రాజ్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు
Post A Comment: