మన్యంటీవీ, అశ్వారావుపేట:
ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామపంచాయతీలో ఐటీడీఏ మరియు ఐసిడిసి వారి ఆధ్వర్యంలో గిరి పోషక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు గర్భిణీలు, బాలింతలు, 3 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల బాలికలకు పౌష్టిక ఆహారం అందిస్తారని వారి తెలిపారు. ఉదయం జొన్న ఉప్మా, జొన్న కిచిడీ, సాయంత్రం స్నాక్స్ పల్లి చెక్క, పల్లి పుట్నాలు, చెక్క కురుకురులు, అందిస్తారు. ఈ యొక్క గిరి పోషక కార్యక్రమం అశ్వారావుపేట మండలంలో కొండరెడ్లు ఉన్న ఏడు గ్రామాలు రెడ్డిగూడెం, నడిమి రెడ్డిగూడెం, బండారుగుంపు, సుద్దగోతులగూడెం, తిరుమల కుంట, గాండ్ల గూడెం, గోగులపూడి మొదలైన గ్రామాలలో నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీడిఓ రోజా రాణి, ఐటీడీఏ ఎపీవో డేవిడ్ రాజు, ఎస్ఓ సురేష్, లక్ష్మి కాంత్, సర్పంచ్ మహేశ్వరెడ్డి, అభియాన్ బిసి హరీష్, సూపర్వైజర్ విజయలక్ష్మి, సౌజన్య, పద్మావతి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భవతులు, బాలింతలు కిశోర బాలికలు, గ్రామము లో తల్లులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: