నేతకాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్
మన్యం టీవీ కరకగూడెం :రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో వెంటనే ఆన్లైన్ తరగతులు బందు చేసే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని, నేతకాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జిమ్మిడి ప్రకాష్ అన్నారు. కరకగూడెం మండల కేంద్రము లో సోమవారం ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ తరగతుల వలన విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అని అన్నారు ఆన్లైన్ తరగతులు తర్వాత విద్యార్థులు సెల్ఫోన్లలో ఆటలు ఆడుతూ రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని అలాంటి విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఆర్థికంగా లేనివారు పిల్లలకు సెల్ ఫోన్లు కొని ఇవ్వకపోవడంతో విద్యార్థులు విచక్షణ కోల్పోయే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆన్లైన్ తరగతులు రద్దు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయన కోరారు.
Post A Comment: