మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 18, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం నాడు పూరిల్లు మట్టి గోడలు వర్షానికి నాని కూలిపోయాయి. వివరాలు... జూలూరుపాడు మండలం,పడమట నర్సాపురం గ్రామం లో సంఘం బొడయ్య, అను వ్యక్తి వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తన ఇంటి మట్టి గోడలు వర్షపు నీటితో నాని ఉండడంతో మట్టి గోడలు కూలిపోయాయి. అసలే పంటలు సరిగా పండక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంటి గోడలు కూలి పోయేసరికి ఇంటిని నిర్మించుకోవడానికి ఇబ్బంది కరంగా ఉందని ఆవేదన చెందుతున్నాడు. ముగ్గురు కుటుంబసభ్యులు ఉంటున్న ఇల్లు ఒక్కసారిగా గోడలు పడిపోవడంతో ఈదురు గాలులకు ఇంట్లో ఉండలేక ఇబ్బంది పడుతున్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
Post A Comment: