మన్యంటీవీ, అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ నారం రాజశేఖర్ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించడం కోసం, ప్రజలు ఆఫీస్ లు చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకూడదని ప్రత్యేక చొరవ తీసుకోని గ్రామ సభ ఏర్పాటు చేసి సమస్య కి సంబంధించిన ఆఫీసర్స్ నీ పిలిపించి ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది.
1. కొత్త రేషన్ కార్డ్స్
2. రేషన్ కార్డు లో పేర్లు యాడ్ చేయించడం.
3. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్
4.57 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొత్త ఫించన్ కు పెట్టుకోవడం, ఇలా అనేక సమస్యల పరిస్కరించడం కోసం ప్రత్యేక చొరవ తీసుకోని ప్రజల కు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకం అర్హులు అయినా ప్రజలకు అందె విధంగా చూస్తున్నారు. ఈ విధంగా సర్పంచ్ చెయ్యడం పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోడం బుచ్చప్ప, సెక్రటరీ సుజాత, ఆర్ ఐ వెంకటేశ్వర్లు, విఆర్ వో రమేష్, టిఏ బాలకృష్ణ, వార్డ్ సభ్యులు రాంబాబు, సుగుణ, లక్ష్మి, వెంకటమ్మ, వీరభద్రమ్మ, నాగేశ్వరావు, సుగుణ, పుల్లమ్మ, గ్రామ పెద్దలు రామకృష్ణ రాజు, జయరాజు, కృష్ణ, కొర్రి మల్లయ్య, వెంకటరమరాజు, పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: