మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన ఘాటో- రియో జపాన్ కరాటే -డూ- హంభూ,బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ను మణుగూరు చీఫ్ ఇన్స్పెక్టర్ డేగల ప్రశాంత్,కాశీమల్ల పద్మ,ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్టులో మణుగూరు విద్యార్థులు మంచి ప్రతిభ ను కనబర్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రచ్చ శ్రీను బాబు,చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ టెక్నికల్ డైరెక్టర్ ఇండియా చీఫ్ యాక్టమీనర్ రచ్చ. భవాని చంద్,వరంగల్ సెక్రటరీ నిరంజన్ మరియు ముఖ్యఅతిథిగా మణుగూరు ఎస్సై పురుషోత్తం టిఆర్ఎస్ నాయకులు బొలిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు.గ్రౌండ్ నందు జరిగినటువంటి మార్షల్ ఆర్ట్స్,కరాటే విద్యార్థులకు మణుగూరు పట్టణ ఎస్ఐ పురుషోత్తం బెల్టు మరియు సర్టిఫికెట్ అందజేసి విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు బోశెట్టి రవి ప్రసాద్,తాళ్లపల్లి రాహుల్ గౌడ్,కరాటే ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్,పద్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: