సీఐ ముత్యం రమేష్ ను ను సన్మానించిన పాత్రికేయులు
గుండాల మండలం తో విడదీయలేని బంధం ఏర్పడింది ముత్యం రమేష్
గుండాల ఆగస్టు 6 (మన్యం మనుగడ) సీఐ ముత్యం రమేష్ ను సన్మానించిన గుండాల పాత్రికేయులు. సంవత్సరంన్నర క్రితం ముత్యం రమేష్ ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టారు.నాటినుండి ప్రజలతో మమేకమై పనిచేస్తూ అందరితో మంచి స్నేహభావంతో వ్యవహరించారు. మండలంలో అనేక కార్యక్రమాలను చేపట్టి సత్ఫలితాలను సాధించారు. ముఖ్యంగా రహదారులు పూర్తికావడం లో ఆయన కీలకపాత్ర పోషించారు. ఎన్నో ఏళ్ల నుండి గిరిజనులు ఎదుర్కొంటున్న కిన్నెరసాని కర్రల వంతెన కు శాశ్వత పరిష్కారం చూపారు. కిన్నెరసాని పై ఇనప వంతెనను ఏర్పాటు చేసి గిరిజనులను కష్టాలనుండి గట్టెక్కించారు. సీఐగా ప్రమోషన్ పై వెళ్లారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు టి నాగరాజు, ఎండి యాకుబ్, కె పాపా చారి, వై యాకయ్య, గడ్డం వీరన్న , ఆర్ సంతోష్ , వై తిరుపతి , బి వినయ్ , ఎం వంశీ , ఎం వినయ్ లు పాల్గొన్నారు
Post A Comment: