👉భద్రాద్రి జిల్లా ప్రజలకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విప్ రేగా కాంతారావు
మన్యం మనుగడ వెబ్ డెస్క్: కష్టసుఖాలలో అమ్మానాన్న తర్వాత గుర్తుకు వచ్చేది స్నేహమే నని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాకశాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా సమభావంతో నడుచుకునేది స్నేహం అన్నారు. హైదరాబాద్ లోని తన స్వగృహంలో స్నేహితుల నడుమ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
హైదరాబాదు లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని వారి నివాసంలో కలిసి తన చిన్ననాటి స్నేహితులు ... స్నేహితుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసి పూల మొక్కను అందజేశారు. పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆదివాసీ సాంస్కృతిక విభాగం నియోజకవర్గ అధ్యక్షులు పోల బోయిన అనిల్ కుమార్, ఉపాధ్యాయులు పడిగ అంజయ్య, పారిజాతం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: