మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని రొయ్యూరు గ్రామ సమీపంలో గల జాతీయ రహదారి 163 పై రాత్రిపూట పశువుల(ఎడ్లు, ఆవులు,గేదెలు) వల్ల వచ్చిపోయే వాహనాలకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రొయ్యూరు గ్రామంలోని పశువుల కొమ్ములకు ఏటూరు నాగారం పవన్ గ్రాఫిక్స్ వారి సహకారంతో రేడియో స్టిక్కరింగ్ అందించడం జరిగిందని పశువుల కొమ్ములకు అంటించిన రేడియం స్టిక్కర్ రాత్రిపూట, లైట్ వెలుతురు లకు రిప్లెక్ట్ కావడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పశువుల యజమానులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: