మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం కాలనీలో సూల వాసు ఇటీవలే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోని ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న కారణంగా వారి యొక్క మెడికల్ బిల్లులను పరిశీలించి, సిఎంఆర్ఎఫ్ కొరకు వాటికి ఏమేమి కావాలో చూచనలు తెలియజేసిన జారే ఆదినారాయణ. ఆదేవిదంగా నారంవారిగూడెం గ్రామంలో పాకనాటి వరలక్ష్మీ మరియు కొండర్దాల నాగేశ్వరి వీరు ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న మెడికల్ బిల్లులను గౌరవ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ద్వారా సిఎంఆర్ఎఫ్ ఇప్పించుటకు వాటికి సంబంధించిన పత్రాలను తీసుకోవడం జరిగింది. అదే గ్రామంలో పెధమల్ల అప్పారావు కాలు సర్జరీ చేయించుకొని తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ నూతక్కి నాగేశ్వరరావు, వార్డు మెంబర్ రాంబాబు, సంగా శీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: