మన్యం మనుగడ వెబ్ డెస్క్:
ఆగస్టు 9 వ తేదీ సోమవారం నుండి భద్రాద్రి జిల్లాలో మండలాల్లో దశల వారిగా "సంచార కోవిడ్ టీకా కార్యక్రమం" ను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కరోనా వ్యాధి నియంత్రణకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా వాక్సిన్ తీసుకోవాలనే చర్యల్లో భాగంగా సంచార వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత త్వరగా వాక్సిన్ అందించి కరోనా నుండి రక్షించాలనే సంకల్పం తో పాటు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను కరోనా బారి నుండి కాపాడేందుకు మొదటి దశలో చర్ల, కరకగూడెం, అశ్వాపురం, ములకలపల్లి, జూలూరూపాడు, అశ్వారావుపేట, గుండాల మండలాల్లో ఈ సంచార వాహనాలు ద్వారా టీకా కార్యక్రమం జరుగుతుందని, తదుపరి దశల వారిగా మిగిలిన మండలాల్లో సంచార వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పని సరిగా కోవిడ్ టీకా తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Post A Comment: