ప్రభుత్వ విప్ కు గౌరవం ఇవ్వరా
గుండాల ఆగస్టు 29 (మన్యం మనుగడ) ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని గుండాల మండలం టిఆర్ఎస్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి, సయ్యద్ అజ్జు, సుధాకర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆదివాసి ఎమ్మెల్యే అయిన రేగా కాంతారావు గౌరవప్రదమైన ప్రభుత్వ విప్ హోదాలో ఉంటే ప్రోటోకాల్ విస్మరించి స్టేజిపైకి పిలవకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యే గౌరవానికి ఎట్టి పరిస్థితిలో బంగారం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా మరల ఇలా జరగకుండా చూసుకోవాలని వారు కోరారు
Post A Comment: