CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉద్యమ నాయకుడు డా.పిడమర్తి.రవికి ఎం.యల్.సి. ఇవ్వాలి.

Share it:

  


రాష్ట్ర క్యాబినెట్ లో సముచిత స్థానం కలిపించాలి.  లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమం తప్పదు. ********************* మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన:- మోదుగు. జోగారావు. ********************* ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ సెంటర్ డా.బి.ఆర్.అంబెడ్కర్ విగ్రహం దగ్గర మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో డా.పిడమర్తి. రవికి ఎం.యల్.సి.ఇచ్చి రాష్ట్ర క్యాబినెట్ లోనికి తీసుకోవాలని జరిగిన నిరసన కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగు.జోగారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తక్షణమే ఉద్యమ నాయకుడు డా.పిడమర్తి. రవికి ఎం.యల్.సి. సీటు ఇచ్చి, క్యాబినెట్ లో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినారు.ఈ రోజు తెలంగాణ ఉద్యమం తో సంబంధం లేని అనేక మంది మంత్రులు గా చలామణి అవుతున్నారు. నిక్కార్శి తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి,300 పైగా కేసులు మీద వేసుకొని,తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన,తెలంగాణ రాష్ట్ర సాధించిన నవయుగ నాయకుడు డా.పిడమర్తి.రవికి ఎం.యల్.సి.ఇవ్వాలని డిమాండ్ చేసినారు.లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం గా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమం లో మహా M.R.P.S.రాష్ట్ర ప్రచార కార్యదర్శి సింగారపు.రమేష్,లెక్చరర్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు కాశిమల్ల.రమేష్, మాదిగ జేఏసీ విద్యార్థి జిల్లా అధ్యక్షులు కొండ్రు.శ్రీహరి,మాదిగ జేఏసీ జిల్లా ప్రచార కార్యదర్శి బిరియా.భీమ్ రాజ్,దళిత సంఘాల ఐక్య కార్యాచరణ జిల్లా నాయకులు కంకణాల. యూజీవ్ రావు, బి.రవి, కె. కుమార్,వి.నరేష్ తదితరులు పాలుగొన్నారు.

Share it:

Post A Comment: