కొంకతి సాంబాశివారావు
మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ రాష్ట్రంలో బీసీ బందు ప్రకటించాలని గంగపుత్ర మహా సభ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. దళిత బంధు తో పాటు బీసీ బందు ప్రకటించాలని రాష్ట్రంలో 52 శాతం బీసీలే ఉన్నారని తెలిపారు. జనాభాలో సింహభాగం ఉన్న తమను విస్మరిస్తే ఊరుకోబోమని తెలిపారు. దళిత బంధు మంజూరు చేసిన వెంటనే బీసీ బంధు ప్రకటించాలని లేకపోతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరం ఐక్యమై ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని తెలిపారు.
Post A Comment: