మన్యం టీవీ మంగపేట
మంగపేట మండలం వాడగూడెం లో రెండు ఇసుక క్వారీలకు పెసా గ్రామ సభ నిర్వహించారు. వాడ గూడెంలో గిరిజన ఓటర్లు మొత్తం159 మంది ఉండగా అందులో 121 మంది గిరిజన ఓటర్లు గ్రామసభకు హాజరయ్యారు.అధికారులు ఒటింగ్ నిర్వహించగా 67 మంది పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క శాండ్ క్వారి ఎల్. సి. సి.ఎస్ లిమిటెడ్ కు ఓటు వేశారు.దీనితో అధికారులు రిజిస్టర్ సొసైటీ అయిన పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క శాండ్ క్వారి ఎల్. సి. సి.ఎస్ లిమిటెడ్ కు ఇసుక క్వారి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చేరాలు,మంగపేట మండల ఎంపిడిఓ ఇక్బాల్,మంగపేట తాశీల్ధార్ బాబ్జి ప్రసాద్ ,పెసా జిల్లా కో ఆర్డినెటర్ ప్రభాకర్, ఎంపీఓ శ్రీకాంత్ ,పంచాయతీ కార్యదర్శి పాషాగిరిజనులు పాల్గొన్నారు.
Post A Comment: